Team India: పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికాను కిందికి నెట్టేసిన భారత్.. ఐదు మ్యాచుల్లో ఓడినా ఇంగ్లండ్ సెమీస్ ఆశలు పదిలమే!

  • భారత్ చేతిలో దారుణంగా ఓడిన ఇంగ్లండ్
  • మరొక్క మ్యాచ్ గెలిస్తే సెమీస్‌కు భారత్
  • మిగతా మ్యాచుల్లో భారీ విజయాలు సాధిస్తే ఇంగ్లండ్‌కు సెమీస్ ఆశలు
  • నేడు శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్
India dethrone South Africa to reclaim top spot

ప్రపంచకప్‌లో భాగంగా గతరాత్రి లక్నోలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా తిరిగి అగ్రస్థానానికి ఎగబాకింది. ఆరు మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్కటే విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు టేబుల్ అట్టడుగున నిలిచింది. భారత్ నిర్దేశించిన 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన ఇంగ్లండ్ 129 పరుగులకే ఆలౌట్ అయింది. అయినప్పటికీ ఆ జట్టుకు టెక్నికల్‌గా ఇంకా సెమీఫైనల్ అవకాశాలు ఉన్నాయి. 

బ్రిటిష్ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మరొక్క మ్యాచ్‌లో కనుక ఓడితే మూటముల్లె సర్దుకోవాల్సి ఉంటుంది. అన్ని మ్యాచుల్లోనూ మంచి రన్‌రేట్‌తో విజయాలు సాధిస్తే మాత్రం నాకౌట్ ఆశలు సజీవంగానే ఉంటాయి. 

మరోవైపు ఆరు మ్యాచుల్లో 12 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్న భారత జట్టు మరొక్క మ్యాచ్‌లో విజయం సాధిస్తే సెమీఫైనల్ బెర్త్ కన్ఫామ్ అయిపోతుంది. ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధించడంతో అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికా రెండో స్థానానికి పడిపోగా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాగా, శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్ మధ్య నేడు పూణెలో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు సెమీ ఫైనల్ రేసులోకి వస్తుంది.

  • Loading...

More Telugu News