Team India: వరల్డ్ కప్ లో టీమిండియా సిక్సర్... ఇంగ్లండ్ ఘోర పరాజయం

  • వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా × ఇంగ్లండ్
  • 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించిన టీమిండియా
  • మొదట 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసిన రోహిత్ సేన
  • 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలిన ఇంగ్లండ్
  • షమీకి 4, బుమ్రాకు 3 వికెట్లు
Team India register sixth win in row after beating England with 100 runs margin

వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఇంగ్లండ్ జట్టును కూడా టీమిండియా అలవోకగా ఓడించింది. తద్వారా టోర్నీలో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసుకుని సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. 

లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. అయితే  లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలి, 100 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. 

టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లతో మరోసారి సత్తా చాటడం విశేషం. బుమ్రాకు 3, కుల్దీప్ యాదవ్ కు 2, జడేజాకు 1 వికెట్ లభించాయి. ఇంగ్లండ్ జట్టులో లియామ్ లివింగ్ స్టన్ చేసి 27 పరుగులే అత్యధికం. టాపార్డర్ వైఫల్యంతో ఏ దశలోనూ ఇంగ్లండ్ విజయం దిశగా పయనిస్తున్నట్టు కనిపించలేదు. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్ ను ఒత్తిడిలోకి నెట్టేశారు.

వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ కు ఇది వరుసగా నాలుగో ఓటమి. ఇక ఈ టోర్నీలో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు పూర్తిగా ఆవిరయ్యాయి. టీమిండియా 6 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ 6 మ్యాచ్ ల్లో 1 విజయం సాధించి కేవలం రెండు పాయింట్లతో జాబితాలో అట్టడుగున ఉంది.

More Telugu News