మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం
- 20వ పిల్లర్ వద్ద కుంగిన బ్యారేజీ
- ఆరుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
- బ్యారేజీని పరిశీలించిన అనిల్ జైన్ నేతృత్వంలోని కేంద్ర కమిటీ
కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు ఉన్నారు. ఈ బ్యారేజీ కుంగడంతో నీటిని విడుదల చేశారు. నీటి మట్టం కనిష్ఠస్థాయికి చేరుకుంది. బ్యారేజ్ ఎగువ నుంచి 57 గేట్ల ద్వారా 22,500 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. మూడు రోజుల క్రితం రాత్రి భారీ శబ్దంతో బ్యారేజ్ 20వ పిల్లర్ కుంగిపోయింది. దీంతో బీ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. క్రస్ట్ గేటుకు పగుళ్లు వచ్చాయి.