Bandi Sanjay: కేసీఆర్ నుంచి డబ్బులు వసూలు చేయాలి.. కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకు:బండి సంజయ్

  • మేడగడ్డ బ్యారేజీ కుంగడంపై బండి సంజయ్ విమర్శలు
  • కమిషన్లపై ఉన్న ఆసక్తి క్వాలిటీపై లేదని మండిపాటు
  • కేసీఆర్ సీఎం కాకపోతే కేటీఆర్ ది బిచ్చపు బతుకు అయ్యేదని విమర్శ
bandi sanjay fires on KCR

మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు మునిగిపోయాయని... ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని విమర్శించారు. తానే ప్రాజెక్టుకు ఇంజనీర్ అని చెప్పుకున్న కేసీఆర్ నుంచే డబ్బులు రికవరీ చేయాలని చెప్పారు. కాసులకు కక్కుర్తి పడే బీఆర్ఎస్ ప్రభుత్వం... తెలంగాణ భవిష్యత్తును సర్వనాశనం చేసిందని అన్నారు. 

కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ జమ్మి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదని సంజయ్ విమర్శించారు. ప్రాజెక్టును సందర్శించేందుకు ఇతర పార్టీల నేతలను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు పరిస్థితిపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

మంత్రి కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకని... కేసీఆర్ సీఎం కాకపోతే కేటీఆర్ ది బిచ్చపు బతుకు అయ్యేదని సంజయ్ చెప్పారు. కేటీఆర్ లా తండ్రి పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. కేటీఆర్ అధికారమదంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అమెరికాలో చిప్పలు కడిగిన విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ మాట్లాడేది కూడా ఒక భాషేనా? అని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News