Chandrababu: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో తుది వాదనలు

chandrababu special leave petition in Supreme court
  • క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంలో పిటిషన్
  • విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం
  • టీడీపీ చీఫ్ తరఫున వాదనలు వినిపించనున్న హరీశ్ సాల్వే

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై మంగళవారం (నేడు) మధ్యాహ్నం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గత శుక్రవారం ఈ కేసులో వాదనలు వినిపించిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ మరికొంత సమయం అడిగారు. దీంతో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల ధర్మాసనం కేసు విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. మధ్యాహ్నం 2 గంటలకు తొలుత ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించాక చంద్రబాబు తరఫున న్యాయవాది హరీశ్ సాల్వే కౌంటర్ వాదనలు వినిపిస్తారు. ఈ రోజు సాయంత్రానికి ఈ కేసులో వాదనలు పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. 

గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై స్కిల్ డెవలప్ మెంట్ కేసు నమోదు చేశారని, ఈ కేసును కొట్టేయాలని ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చడంతో చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ ప్రకారం.. ముందుగా గవర్నర్ అనుమతి తప్పనిసరని, ఈ నిబంధనను సీఐడీ అధికారులు పాటించలేదని, నిబంధనలకు విరుద్ధంగా తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని అత్యున్నత న్యాయస్థానానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News