TDP: జనసేనతో సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు చేసిన టీడీపీ

  • ఇటీవల టీడీపీతో పొత్తు ప్రకటన చేసిన పవన్ కల్యాణ్
  • భాగస్వామ్యం దిశగా ముందడుగు వేసిన టీడీపీ
  • ఐదుగురు సభ్యులతో కమిటీ 
TDP forms committee for coordination with Janasena party

ఇటీవల చంద్రబాబు అరెస్ట్ కాగా, జైలులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పొత్తు దిశగా టీడీపీ ముందడుగు వేసింది. జనసేనతో సమన్వయం కోసం నేడు టీడీపీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో వెల్లడించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు జనసేన పార్టీతో సమన్వయం కోసం కమిటీని నియమించినట్టు వెల్లడించారు. ఇరు పార్టీల సమన్వయం కోసం ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు.

 కమిటీలోని సభ్యులు...

1. కింజరాపు అచ్చెన్నాయుడు
2. యనమల రామకృష్ణుడు
3. పయ్యావుల కేశవ్
4. పితాని సత్యనారాయణ 
5. తంగిరాల సౌమ్య

More Telugu News