బీఆర్ఎస్ ప్రచార రథం రెడీ.. ఫొటోలు ఇవిగో!
- కేసీఆర్ కు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ కానుక
- ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్న స్పెషల్ బస్సు
- నేడు హుస్నాబాద్ సభలో ప్రచార రథం ప్రారంభం
ఆదివారం (నేడు) జరగనున్న హుస్నాబాద్ ప్రచార సభలో ఈ బస్సును కేసీఆర్ ఉపయోగించనున్నారు. ఇందుకోసం ఈ ప్రచార రథం హుస్నాబాద్ కు పయనమైనట్లు సమాచారం. ప్రచార రథాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటో, కారు గుర్తు, భారతదేశ పటంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మొత్తం గులాబీ రంగుతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

