BRS Bus: బీఆర్ఎస్ ప్రచార రథం రెడీ.. ఫొటోలు ఇవిగో!

Up Ex Cm Akhilesh Gifts Luxury Poll Campaign Bus To Brs Chief Kcr
  • కేసీఆర్ కు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ కానుక
  • ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్న స్పెషల్ బస్సు
  • నేడు హుస్నాబాద్ సభలో ప్రచార రథం ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకుంది. హుస్నాబాద్ నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించేందుకు సీఎం కేసీఆర్ కోసం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఓ బస్సును అందించారు. ప్రత్యేకంగా తయారుచేసిన ఈ బస్సు ఇటీవలే హైదరాబాద్ కు చేరుకుంది.

ఆదివారం (నేడు) జరగనున్న హుస్నాబాద్ ప్రచార సభలో ఈ బస్సును కేసీఆర్ ఉపయోగించనున్నారు. ఇందుకోసం ఈ ప్రచార రథం హుస్నాబాద్ కు పయనమైనట్లు సమాచారం. ప్రచార రథాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటో, కారు గుర్తు, భారతదేశ పటంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మొత్తం గులాబీ రంగుతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.




BRS Bus
KCR
Election campaign
Husnabad
Akhilesh Yadav

More Telugu News