చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- హైదరాబాద్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వ్యక్తి
- సనత్ నగర్ లోని దీక్షా శిబిరం వద్ద ఘటన
- ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న కార్యకర్తలు
ఈ క్రమంలోనే సనత్ నగర్ డివిజన్ లోని జెక్ కాలనీలో టీడీపీ కార్యకర్తలు దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో స్థానిక నేతలు, కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. తాజాగా శనివారం ఉదయం దీక్షా శిబిరం వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం సనత్ నగర్ లో కలకలం రేపింది. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న శ్రీనివాస్ ను అక్కడున్న పార్టీ నేతలు వారించారు. శ్రీనివాస్ ను అడ్డుకుని అతడిపై నీళ్లు కుమ్మరించారు. దీంతో ప్రమాదం తప్పింది.