Indian Railways: మహిళా పోలీస్ స్టేషన్ సరే.. ఏపీలోని ‘మహిళా రైల్వే స్టేషన్’ గురించి ఎప్పుడైనా విన్నారా?

Five railway stations in the country are entirely managed by women staff
  • దేశంలో మొత్తం ఐదు స్టేషన్ల బాధ్యతలను పూర్తిగా మహిళలకే అప్పగించిన కేంద్రం
  • తొలి మహిళా రైల్వే స్టేషన్‌గా గాంధీ నగర్ రైల్వే స్టేషన్‌కు గుర్తింపు
  • ఏపీలోని చంద్రగిరి రైల్వే స్టేషన్ బాధ్యతలు కూడా మహిళా సిబ్బందే

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు తోడు ప్రభుత్వ విధానాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. మహిళలనే ప్రోత్సహించే దిశగా అనేక వినూత్న చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఐదు పోలీస్ స్టేషన్ల బాధ్యతలను పూర్తిగా మహిళలకే అప్పగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం ఐదు మహిళా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏపీలో కూడా ఉండటం మరో విశేషం. 

చంద్రగిరి రైల్వే స్టేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉందీ రైల్వే స్టేషన్. ఇది గుంతకల్లు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ అందరూ మహిళలే ఉంటారు. అన్ని బాధ్యతలూ వారే చూసుకుంటారు. 

మాతుంగా రైల్వే స్టేషన్: 
ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్‌లో కూడా అందరూ మహిళా ఉద్యోగులే. ఈ స్టేషన్ 2018లో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 

గాంధీనగర్ రైల్వేస్టేషన్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఈ స్టేషన్‌ దేశంలోనే తొలి మహిళ రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందింది. 

మణినగర్ రైల్వేస్టేషన్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఈ స్టేషన్ ఉంది. స్టేషన్ మాస్టర్‌తో సహా మొత్తం 25 మంది ఉద్యోగులున్నారు. రైల్వే సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన 10 మంది మహిళా సైనికులు ఇక్కడ భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. 

  • Loading...

More Telugu News