మహిళా పోలీస్ స్టేషన్ సరే.. ఏపీలోని ‘మహిళా రైల్వే స్టేషన్’ గురించి ఎప్పుడైనా విన్నారా?
- దేశంలో మొత్తం ఐదు స్టేషన్ల బాధ్యతలను పూర్తిగా మహిళలకే అప్పగించిన కేంద్రం
- తొలి మహిళా రైల్వే స్టేషన్గా గాంధీ నగర్ రైల్వే స్టేషన్కు గుర్తింపు
- ఏపీలోని చంద్రగిరి రైల్వే స్టేషన్ బాధ్యతలు కూడా మహిళా సిబ్బందే
చంద్రగిరి రైల్వే స్టేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉందీ రైల్వే స్టేషన్. ఇది గుంతకల్లు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ అందరూ మహిళలే ఉంటారు. అన్ని బాధ్యతలూ వారే చూసుకుంటారు.
మాతుంగా రైల్వే స్టేషన్: ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్లో కూడా అందరూ మహిళా ఉద్యోగులే. ఈ స్టేషన్ 2018లో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది.
గాంధీనగర్ రైల్వేస్టేషన్: రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉన్న ఈ స్టేషన్ దేశంలోనే తొలి మహిళ రైల్వేస్టేషన్గా గుర్తింపు పొందింది.
మణినగర్ రైల్వేస్టేషన్: గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఈ స్టేషన్ ఉంది. స్టేషన్ మాస్టర్తో సహా మొత్తం 25 మంది ఉద్యోగులున్నారు. రైల్వే సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన 10 మంది మహిళా సైనికులు ఇక్కడ భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు.