Bonikapur: శ్రీదేవి మరణంపై నన్ను 48 గంటలు విచారించారు: బోనీకపూర్

Dubai Police Enquired me nearly 48 hours about my wifes suden death says Bonikapur
  • భార్య మృతిపై తాజాగా వివరణ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత
  • ఎలాంటి కుట్ర లేదని తేలాకే వదిలిపెట్టారని వివరణ
  • మంచి శరీరాకృతి కోసం శ్రీదేవి కఠినమైన డైట్ పాటించేదని వెల్లడి
అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల తార శ్రీదేవి అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. దుబాయ్ లోని ఓ హోటల్ బాత్ టబ్ లో శ్రీదేవి చనిపోవడం ఆమె అభిమానులను దిగ్భ్రాంతి పరిచింది. శ్రీదేవి మరణంపై చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీటిపై శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తాజాగా మరోసారి స్పందించారు. తన భార్య సడెన్ గా చనిపోవడంతో దుబాయ్ పోలీసులు తనను సుదీర్ఘంగా విచారించారని తెలిపారు. దాదాపు 48 గంటల పాటు అన్ని రకాలుగా ప్రశ్నించి, శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్ర లేదని తేలడంతోనే తనను వదిలిపెట్టారని చెప్పారు.

తన భార్య చనిపోవడానికి కారణం ఆమె ఆహార నియమాలేనని భావిస్తున్నట్లు బోనీ కపూర్ చెప్పారు. శరీరాకృతిని అందంగా ఉంచుకునేందుకు ఆమె కఠినమైన డైట్ ను ఫాలో అయ్యేదని తెలిపారు. ఉప్పు, కారం లేని ఆహారం మాత్రమే, అదీ అతి తక్కువ పరిమాణంలో తీసుకునేదని వివరించారు. దీంతో శ్రీదేవి లోబీపీతో బాధపడేదని, తరచూ కళ్లు తిరిగి పడిపోయేదని బోనీ కపూర్ చెప్పారు. వైద్యులు చెప్పినా ఆమె తన ఆహారపుటలవాట్లను మార్చుకోలేదని వివరించారు. ఈ క్రమంలోనే కళ్లు తిరిగి బాత్ టబ్ లో పడిపోయి ఉంటుందని, నీళ్లలో పడడంతో ఊపిరి ఆడక చనిపోయి ఉంటుందని బోనీ కపూర్ చెప్పారు.
Bonikapur
Sridevi
Dubai Police
48 hours
Enquiry

More Telugu News