కుదిరిన డీల్.. ఎల్లుండి కాంగ్రెస్లోకి మైనంపల్లి!
- ఇటీవలే బీఆర్ఎస్ను వీడిన మైనంపల్లి
- మైనంపల్లికి మల్కాజిగిరి, కుమారుడు రోహిత్కు మెదక్ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే
- ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక
- ఆయన వెంట నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా..
మైనంపల్లికి మల్కాజిగిరి, ఆయన కుమారుడికి మెదక్ సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. మైనంపల్లితోపాటు మరో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం.