చంద్రబాబు సీఐడీ విచారణ: 25 మంది కూర్చునేలా హాలు సిద్ధం చేస్తోన్న జైలు అధికారులు
- రేపు, ఎల్లుండి చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ
- జైలు డిప్యూటీ సూపరింటెండెంట్కు కాన్ఫరెన్స్ హాలు పర్యవేక్షణ బాధ్యత
- భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్న ఎస్పీ
సెంట్రల్ జైల్లో కాన్ఫరెన్స్ హాలును విచారణ కోసం సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు సహా 25 మంది కూర్చునేలా సిద్ధం చేసి సీఐడీకి జైలు అధికారులు అప్పగించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ హాలు పర్యవేక్షణ బాధ్యతలను జైలు డిప్యూటీ సూపరింటెండెంట్కు అప్పగించారు. సీఐడీ ఇచ్చిన సమాచారంతో ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పటికే విచారణకు సంబంధించి కోర్టు నుంచి సూపరింటెండెంట్ కార్యాలయానికి సమాచారం అందింది.