Telangana: 'మొసలి కన్నీరు మాయం' అంటూ గవర్నర్ తమిళిసై ఆసక్తికర ట్వీట్

Governor Tamilisai interesting tweet over womens reservation bill nod
  • మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ గవర్నర్
  • దార్శనిక నాయకుల చొరవ ముందు రాజకీయ వారసులు, రాజవంశీకుల మొసలి కన్నీరు మాయమంటూ ట్వీట్ 
  • ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారన్న దానిపై చర్చ

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించే తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ట్విట్టర్ (ఎక్స్)లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందడంపై తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 

‘దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లును ప్రధాని మోదీ విజయవంతంగా ఆమోదింపజేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి దేశం మొత్తం ధన్యవాదాలు తెలుపుతోంది. రాజకీయవారసులు, రాజవంశీకుల మొసలి కన్నీరు దార్శనిక నాయకుల చొరవ ముందు మాయమయ్యాయి’ అని గవర్నర్‌ తమిళిసై ట్వీట్ చేశారు. అయితే, గవర్నర్‌ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారన్న దానిపై చర్చ మొదలైంది. మహిళా బిల్లు ఆమోదం తమ వల్లే సాధ్యమైందని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వారసులు, రాజవంశీకులను కూడా ప్రస్తావిస్తూ గవర్నర్‌ చేసిన ట్వీట్‌ చర్చకు దారితీసింది.

  • Loading...

More Telugu News