‘వందేభారత్’లో 25 మార్పులు.. ప్రయాణం ఇకపై మరింత సౌకర్యవంతం
- 8 గంటల పాటు కూర్చుని ప్రయాణించాల్సి రావడంతో ప్రయాణికుల్లో అసౌకర్యం
- ప్రయాణాన్ని సౌకర్యవంతం చేసేందుకు వందేభారత్ రైళ్లలో రైల్వే కీలక మార్పులు
- సీట్ల పుష్ బ్యాక్ పెంపు, ఫుట్రెస్ట్కు మెరుగులు
- ఏసీ సమర్థవంతంగా పనిచేసేలా మార్పులు
మరోవైపు, గురువారం కాచిగూడ-యశ్వంత్పూర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్లిన రైలు రాత్రి తిరిగొచ్చింది. ఇక విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైళ్లన్నీ గూడూరు నుంచి నేరుగా వెళుతుంటే విజయవాడ-చెన్నై వందేభారత్ మాత్రం గూడురు నుంచి శ్రీకాళహస్తి, రేణిగుంట, అరక్కోణం, తిరువళ్లూరు మీదుగా చెన్నైకి వెళుతుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు.