Lok Sabha: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

  • బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు
  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఇద్దరు సభ్యుల ఓటు
  • ఎలక్ట్రానిక్ విధానంలో సాంకేతిక సమస్య
  • స్లిప్పులు పంచి ఓటింగ్ నిర్వహణ
Lok Sabha passes Womens Reservation Bill

మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు, వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. నిన్న దిగువ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై ఈ రోజు సుదీర్ఘంగా 8 గంటల పాటు చర్చ సాగింది. బిల్లుపై 60 మంది సభ్యులు మాట్లాడారు. చివర్లో అమిత్ షా బిల్లుపై చర్చకు సమాధానం ఇచ్చారు. కొత్త పార్లమెంట్ భవనంలో ఈ బిల్లును తొలుత ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ద్వారా ఆమోదించాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా ఆ తర్వాత సభ్యులకు స్లిప్పులు ఇచ్చారు. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులు ఇచ్చి ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో 456 మంది సభ్యులు ఉన్నారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు చట్టసభల్లో (లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీలు) 33 శాతం సీట్లు దక్కుతాయి. అయితే 2024 ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలు కాదు. 2029 ఎన్నికల్లో అమలు కానుంది.

More Telugu News