Telangana Liberation Day: పరేడ్ గ్రౌండ్స్‌లో వైభవంగా తెలంగాణ విమోచన దినోత్సవం

  • కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
  • ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు
  • తొలుత వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళి
  • అనంతరం, జాతీయ జెండా ఆవిష్కరణ
  • నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శమని అమిత్ షా వ్యాఖ్య
Central government celebrates Telangana liberation day in parade grounds

నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విమోచన పోరాటంలో పాల్గొన్న అమరవీరులకు వార్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించారు. 

అనంతరం, అమిత్ షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని అమిత్ షా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో అమిత్ షాతో పాటూ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News