ఈడీ నిఘాలో 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలు
- దుబాయిలో మహాదేవ్ గ్యాంబ్లింగ్ యాప్ యజమాని చంద్రశేఖర్ వివాహం
- రూ.200 కోట్ల ఖర్చు.. బాలీవుడ్ సెలబ్రిటీలకు భారీగా చెల్లింపులు
- విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేస్తున్న ఈడీ
సౌరభ్ కు వ్యతిరేకంగా రూ.5,000 కోట్ల మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. చంద్రశేఖర్, అతడి భాగస్వామి రవి ఉప్పల్ దుబాయి నుంచి ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ యాప్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ చత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన వారు. వీరి కోసం ఈడీ వేటాడుతోంది. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం చంద్రశేఖర్ 2022లోనూ దుబాయిలో పెద్ద పార్టీ ఒకటి నిర్వహించాడు. ఆ సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలకు రూ.40 కోట్లు చెల్లించాడు. చంద్రశేఖర్ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలపై గత డిసెంబర్ నుంచి ఈడీ దర్యాప్తు నిర్వహిస్తుండగా, బాలీవుడ్ తో లింకుల వ్యవహారం తాజాగానే వెలుగు చూసినట్టు తెలిసింది.