Sidhartha Luthra: చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఆయన కుటుంబాన్ని కలిసిన సిద్ధార్థ లూథ్రా

  • చంద్రబాబుతో ములాఖత్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించిన న్యాయవాది
  • ఆరున్నర గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్న లూథ్రా
  • న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చ!
Sidhartha Luthra meets Chandrababu family

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును జైల్లో కలిసిన అనంతరం ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా... చంద్రబాబు కుటుంబంతో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేతతో జరిగిన ములాఖత్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ తర్వాత ఆయన సాయంత్రం గం.6.30 సమయానికి ఢిల్లీకి బయలుదేరనున్నారు.  

కోర్టులో జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణ తదితర అంశాలపై చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై వారు చర్చించారని సమాచారం. ఆ తర్వాత మీడియాతో మాట్లాడకుండా నేరుగా చంద్రబాబు కుటుంబ సభ్యులను కలిశారు.

More Telugu News