అక్షయ్ కుమార్ ‘మిషన్ రాణిగంజ్’ టీజర్ వచ్చేసింది
- 1989 నవంబర్ 13న రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో ప్రమాదం ఆధారంగా చిత్రం
- మైనింగ్ ఇంజనీర్ పాత్రలో నటించిన అక్షయ్
- హీరోయిన్ గా పరిణీతి చోప్రా
1989 నవంబర్ 13న రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో జరిగిన ప్రమాదం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ప్రమాదంలో జస్వంత్ సింగ్ గిల్ అనే మైనింగ్ ఇంజనీర్ బొగ్గు గనుల్లో చిక్కుకున్న 64 మందిని కార్మికులను కాపాడారు. ఆయన పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించారు. టీజర్ లో ఈ విషయాన్ని ఆసక్తికరంగా చూపెట్టారు. ఈ సినిమా అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి.