‘భారత్’పై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక కామెంట్
- ఇండియా అంటే భారత్ అన్న విదేశాంగ మంత్రి
- భారత రాజ్యాంగంలోనూ ఇదే ప్రతిఫలిస్తుందని వెల్లడి
- రాజ్యాంగం చదివి తెలుసుకోవాలని సూచన
‘‘ఇండియా అంటే భారత్. రాజ్యాంగంలో ఇదే ఉంది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని ఆహ్వానిస్తున్నాను. భారత్ అని చెప్పారంటే దానర్థం, అవగాహన అనేవి రాజ్యంగంలోనూ ప్రతిఫలిస్తాయి’’ అని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు తీసుకొస్తుండడం, వలస పాలన నాటి పేర్లను మారుస్తుండడం తెలిసిందే. ఇండియా పేరు కూడా బ్రిటిష్ పాలనా సమయం నుంచే వచ్చింది. అంతకుముందు వరకు భారత్, హిందుస్థాన్ అనే పేర్లు వాడుకలో ఉండేవి.