కుక్క కరిచిన విషయం దాచిన బాలుడు.. నెల తర్వాత రేబిస్ తో మృతి
- ఘజియాబాద్ లో దారుణం.. పొరుగింటి వారిపై పోలీస్ కేసు
- ఢిల్లీలో ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లినా చేర్చుకోలేదని ఆరోపణ
- బులంద్ షహర్ ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి
రోజులు గడుస్తున్న కొద్దీ షావాజ్ విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నీళ్లను చూస్తే వణికిపోవడంతో పాటు ఈ నెల 1 నుంచి ఆహారం మానేశాడు. ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆరా తీయగా.. పక్కింటి వాళ్ల కుక్క కరిచిందని చెప్పాడు. దీంతో వెంటనే షావాజ్ ను వారు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, పరిస్థితి విషమించిందని వైద్యులు అడ్మిట్ చేసుకోలేదు. గత్యంతరం లేక బులంద్ షహర్ లోని ఓ ఆయుర్వేద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ షావాజ్ సోమవారం సాయంత్రం కన్నుమూశాడు. షావాజ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పొరుగింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.