Junior NTR: రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.. జూనియర్ ఎన్టీఆర్ దూరం!

Chandrababu and NTR family members reached Rashtrapati Bhavan and Junior NTR skipped
  • ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రూ. 100 నాణేన్ని ముద్రించిన కేంద్రం
  • నాణేన్ని విడుదల చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • షూటింగ్ బిజీ వల్ల వెళ్లలేకపోయిన జూనియర్ ఎన్టీఆర్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. ఈ నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపట్లో విడుదల చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. 

అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే, 'దేవర' సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా తారక్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది. మరోవైపు, ఎన్టీఆర్ భార్యనైన తనను కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని కోరుతూ వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి రాష్ట్రపతికి లేఖ రాసినప్పటికీ... రాష్ట్రపతి భవన్ నుంచి ఆమెకు ప్రతిస్పందన రాలేదు. దీంతో, ఆమె ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.

ఇంకోవైపు, ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నాణేన్ని హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో ముద్రించారు.

  • Loading...

More Telugu News