సన్నీ డియోల్ విల్లా వేలం నోటీసులను వెనక్కి తీసుకున్న బ్యాంకు.. కాంగ్రెస్ విమర్శలు!
- బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 56 కోట్లు తీసుకున్న సన్నీ డియోల్
- రుణం తిరిగి చెల్లించకపోవడంతో విల్లాను వేలం వేస్తున్నట్టు ప్రకటించిన బ్యాంకు
- సాంకేతిక కారణాలతో నోటీసులను వెనక్కి తీసుకున్నామన్న బ్యాంకు
మరోవైపు నోటీసులను బ్యాంకు వెనక్కి తీసుకోవడంపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... రూ. 56 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించనందుకు సన్నీడియోల్ ప్రాపర్టీని బ్యాంకు వేలం వేస్తున్నట్టు నిన్న మధ్యాహ్నం దేశంలోని అందరికీ తెలిసిందని ఆయన అన్నారు. కనీసం 24 గంటలకు కూడా గడవకుండానే నోటీసులను బ్యాంకు సాంకేతిక కారణాలతో ఉపసంహరించుకున్నట్టు తెలిసిందని ఎద్దేవా చేశారు. సాంకేతిక కారణాలను ఎవరు ప్రేరేపించారనేది తనకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు.