జీవితంలో తొలిసారి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణం.. పట్టరాని సంతోషంలో ఐపీఎల్ స్టార్!
- కేకేఆర్ తరఫున గత ఐపీఎల్ లో సత్తా చాటిన రింకూ సింగ్
- ఐర్లాండ్ తో టీ20 సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్
- ఈ రోజు ఐర్లాండ్ తో తొలి టీ20 ఆడనున్న టీమిండియా
అటు భారత జట్టులోకి రావడం, ఇటు తొలి బిజినెస్ క్లాస్ ప్రయాణంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. తన మొదటి బిజినెస్ క్లాస్ ప్రయణ అనుభవాన్ని రింకూ సహచర క్రికెటర్ జితేశ్ శర్మ తో పంచుకున్నాడు. రింకూను జితేశ్ ఇంటర్వ్యూ చేసిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘నాకు చాలా ఆనందంగా ఉంది. టీమిండియాకు ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. ఇప్పుడు నా కల నెరవేరుతోంది. నా గదిలోకి వెళ్లి నా పేరుతో ఉన్న (35వ నంబర్) జెర్సీ చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యా. ఈ రోజు కోసమే నేను ఎంతో కష్టపడ్డాను’ అని అన్నాడు. కాగా, ఐర్లాండ్ తో జరిగే మూడు టీ20ల సిరీస్ లో భారత జట్టుకు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.