ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రైల్వే పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.3,238 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ పనులకు ఆమోదం
- డోన్-మహబూబ్ నగర్, మేడ్చల్-ముద్ఖేడ్ మధ్య డబ్లింగ్ పనులు
- బారాంగ్, కుర్దారోడ్ -విజయనగరం వరకు మూడో లైన్కు ఆమోదముద్ర
దీంతో పాటు రూ.5,655.4 కోట్ల అంచనా వ్యయంతో డోన్-మహబూబ్ నగర్, మేడ్చల్-ముద్ఖేడ్ మధ్య డబ్లింగ్ పనులకు ఆమోదం తెలిపింది. రూ.417.6 కిలో మీటర్ల మేర రూ.5,618.26 కోట్ల అంచనా వ్యయంతో బారాంగ్, కుర్దా రోడ్ - విజయనగరం వరకు రూ.5,655.4 కోట్ల అంచనా వ్యయంతో మూడో లైన్కు ఆమోద ముద్ర వేసింది. మొత్తం రూ.32,500 కోట్ల అంచనా వ్యయంతో యూపీ, బీహార్, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్ వర్క్ను విస్తరించనుంది.