Varahi Yatra: పవన్ మూడో విడత వారాహి యాత్రకు సర్వం సిద్ధం.. వివిధ కమిటీలకు సభ్యులు వీరే!

  • ఈ నెల 10 నుంచి మూడో విడత వారాహి యాత్ర
  • విశాఖపట్నం నుంచి మూడో విడత యాత్ర ప్రారంభం
  • యాత్ర కమిటీల సమన్వయకర్తగా మల్నీడి తిరుమలరావు
Different committees of Pawan Kalyan Varahi Yatra

వైసీపీ పాలనకు ముగింపు పలకడమే ధ్యేయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రెండు విడతల యాత్ర పూర్తయింది. వారాహి యాత్రలకు ముఖ్యంగా యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. తాజాగా మూడో విడత యాత్రకు పవన్ రెడీ అయ్యారు. ఈ నెల 10 నుంచి విశాఖపట్నంలో మూడో విడత యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పలు కమిటీలను జనసేన అధినాయకత్వం ఖరారు చేసింది. 

కమిటీల వివరాలు:
కమిటీల సమన్వయకర్త: మల్నీడి తిరుమలరావు

క్యాటరింగ్ కమిటీ: బండి రామకృష్ణ, మధు వీరేశ్, కత్తిపూడి బాబీ, మోకా నాని, రావాడ నాగు, కె.రామారావు, సత్తిబాబు, గల్లా తిమాతి, మేడిద దుర్గాప్రసాద్, సుందరనీడి పట్టాభిరామయ్య, మాగాపు వీర్రాజు, మొండా శివప్రసాద్. 

ఆపరేషన్ కమిటీ: ధవళ కీర్తేశ్, విష్వక్సేన్, యడ్లపల్లి రాంసుందర్, తోరం శశాంక్. 

మెడికల్ అసిస్టెన్స్ కమిటీ: రఘు, గౌతమ్ రాజ్, డాక్టర్ లక్ష్మణ్, బి.రవికాంత్, శ్రీమతి వసంత లక్ష్మి, బత్తుల రామకృష్ణ. 

వాలంటీర్ల కమిటీ: బోడపాటి శివదత్, చాగంటి మురళీకృష్ణ, కొరియర్ శ్రీనివాస్, పవన్ కుమార్, ఎ.విక్రమ్, శ్రీనివాస పట్నాయక్, సందు పవన్. 

మీడియా సమన్వయ కమిటీ: పీలా రామకృష్ణ, బొలియాశెట్టి శ్రీకాంత్, ఆళ్ల హరి, వి.సతీశ్, వీఎన్ఎస్ చంద్రరావు.

More Telugu News