Tilak Varma: విండీస్ తో రెండో టీ20... మళ్లీ మనవాడే మెరిశాడు!

  • టీమిండియా, విండీస్ మధ్య రెండో టీ20
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • అర్ధసెంచరీ సాధించిన తిలక్ వర్మ
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసిన భారత్
Tilak Varma shines with half century for Team India

వెస్టిండీస్ తో రెండో టీ20 మ్యాచ్ లోనూ తెలుగుతేజం తిలక్ వర్మ సత్తా చాటాడు. తొలి టీ20లో 39 పరుగులు చేసిన తిలక్ వర్మ... నేడు అర్ధసెంచరీతో మెరిశాడు. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. 

ఓపెనర్ ఇషాన్ కిషన్ 27 పరుగులు చేయగా, మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (1) నిరాశపరిచారు. ఈ దశలో తిలక్ వర్మ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఎడమచేతివాటం ఆటగాడు 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 51 పరుగులు చేశాడు. 

సంజు శాంసన్ 7 పరుగులకే అవుట్ కాగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 24, అక్షర్ పటేల్ 14 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అకీల్ హోసీన్ 2, అల్జారీ జోసెఫ్ 2, రొమారియో షెపర్డ్ 2 వికెట్లు తీశారు.

More Telugu News