తూ.గో. జిల్లాలో విషాదం.. కారు కాల్వలో పడి ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
- ఏలూరులో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు
- విహారయాత్రకు రెండు కార్లలో 10 మంది విద్యార్థులు
- తిరిగి వస్తుండగా అర్ధరాత్రి ప్రమాదం
- బూరుగుపూడి సమీపంలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు
ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత బూరుగుపూడి సమీపంలో ఓ కారు అదుపుతప్పి పాత, కొత్త వంతెనల మధ్యనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఉదయ్కిరణ్, హర్షవర్ధన్, హేమంత్ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.