110 ఇంచుల సామ్సంగ్ ఎల్ఈడీ టీవీ.. ధర రూ.1,14,99,000 మాత్రమే!
- అల్ట్రా లగ్జరీ మైక్రో ఎల్ఈడీ టీవీని విడుదల చేసిన సామ్సంగ్
- టీవీలో 2.48 కోట్ల చిన్న సైజ్ఎల్ఈడీలు
- అధునాతన ఫీచర్లతో రూపొందిన టీవీ
ఈ ఎల్ఈడీలన్నీ ఒక్కొక్కటిగా లైట్, కలర్ను విడుదల చేస్తాయి. దాంతో, అత్యంత నాణ్యమైన దృశ్యాలను చూడవచ్చు. థియేటర్ ను మించిన క్లారిటీతో డాల్బీ అట్మోస్, 3డీ సౌండ్వంటి హై క్వాలిటీ ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి. పైగా, ఈ భూమి మీద లభించే రెండో దృఢమైన పదార్థం అయిన సాఫైర్ పదార్థంతో ఈ టీవీని తయారు చేయడం అతి పెద్ద విశేషం. ఈ టీవీ ఎంపిక చేసిన తమ స్టోర్లలో లభ్యం అవుతుందని సామ్సంగ్ తెలిపింది.