MMTS: వారం పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

  • ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకూ 22 ఎంఎంటీఎస్ రైలు సర్వీసుల రద్దు
  • లింగంపల్లి, హైదరాబాద్, ఉందానగర్, ఫలక్‌నుమా మధ్య నడిచే సర్వీసుల రద్దు
  • రైల్వే ట్రాకుల నిర్వహణ, మరమ్మతుల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్న దక్షిణమధ్య రైల్వే
22 MMTS services suspended for a week for maintenance of tracks and other repair works

ఈ నెల 31 నుంచి వారం పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే శాఖ శుక్రవారం ప్రకటించింది. రైల్వే ట్రాకుల నిర్వహణ, మరమ్మతుల నేపథ్యంలో సర్వీసులు రద్దు చేసినట్టు తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే 12 ఎంఎంటీఎస్ రైళ్లు, ఉందానగర్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 10 సర్వీసులను రద్దు చేసినట్టు వెల్లడించింది.

  • Loading...

More Telugu News