'ఇండియా' కూటమి కీలక నిర్ణయం.. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం?
- మణిపూర్ హింసపై అట్టుడుకుతున్న పార్లమెంటు
- మణిపూర్ ఘటనపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు
- ఈ ఉదయం మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
మరోవైపు ఈ ఉదయం ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇంకోవైపు ఈ సమావేశంలో విపక్షాల తీరుపై మోదీ మండిపడినట్టు సమాచారం. దశ, దిశ లేకుండా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.