భారత్ నుంచి పలు సందర్భాల్లో తరలించిన 105 కళాఖండాలను తిరిగి అప్పగించిన అమెరికా
- ఇటీవల అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన
- అపురూవ వస్తువులు తిరిగిచ్చేస్తామని అమెరికా హామీ
- న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ లో కార్యక్రమం
- కళాఖండాల అప్పగింతలు పూర్తి చేసిన అమెరికా అధికారులు
ఈ నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. వివిధ సందర్భాల్లో భారత్ నుంచి తరలించిన 105 కళాఖండాలను అమెరికా తిరిగి అప్పగించింది. ఇవాళ న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధూకు వాటిని అమెరికా అధికారులు అందజేశారు.
ఈ అపురూప వస్తువుల్లో తూర్పు భారతదేశానికి చెందినవి 47, మధ్య భారతదేశానికి చెందినవి 22, ఉత్తర భారతదేశానికి చెందినవి 6, దక్షిణ భారతదేశానికి చెందినవి 27, పశ్చిమ భారతదేశానికి చెందినవి 3 ఉన్నాయి.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించడం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో, ఆ కళాఖండాలను తిరిగి భారత్ కు ఇచ్చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది.
