ఏఐనీ వాడేస్తున్న సైబర్ నేరగాళ్లు.. ముఖం మార్చుకుని స్నేహితుడిలా నమ్మించి రూ. 40 వేలు కొట్టేసిన మాయగాడు!
- కేరళలోని కోజికోడ్లో ఘటన
- వాట్సాప్లో వీడియో కాల్ చేసి మరీ డబ్బులు అడిగిన వైనం
- తన స్నేహితుడేనని నమ్మి డబ్బులు పంపిన బాధితుడు
- మరోమారు అడగడంతో అనుమానం
- స్నేహితుడిని ఆరా తీస్తే బయటపడిన అసలు నిజం
అతడు తన స్నేహితుడేనని భావించిన రాధాకృష్ణ రూ. 40 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరోమారు ఫోన్ చేసి రూ. 35 వేలు కావాలని అడగడంతో అనుమానించిన రాధాకృష్ణ తన స్నేహితుడిని సంప్రదించడంతో అసలు విషయం తెలిసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి సొమ్మును స్వాధీనం చేసుకుని రాధాకృష్ణకు అప్పగించారు.