కేటీఆర్! సిద్ధిపేట, సిరిసిల్ల, చింతమడక... ఎక్కడైనా సిద్ధం: రేవంత్ రెడ్డి సవాల్
- తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపిస్తానన్న టీపీసీసీ చీఫ్
- ఎంపీ కోమటిరెడ్డి నిరూపించారని వెల్లడి
- విద్యుత్ కొనుగోలు పేరిట దోచుకుంటున్నారని ఆరోపణ
విద్యుత్ కొనుగోలు పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లుగా చూపిస్తున్నారని, ఇందులో రూ.8 వేల కోట్లు బీఆర్ఎస్ నేతలే దోచుకుంటున్నారన్నారు. ఎక్కువ గంటలను చూపిస్తూ కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని, కానీ సాగుకు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం లేదని, నిరూపించేందుకు తాను సిద్ధమని పునరుద్ఘాటించారు. సిద్ధిపేట, సిరిసిల్ల, చింతమడక.. ఎక్కడకైనా వస్తానన్నారు. కేంద్రం తక్కువ ధరకు విద్యుత్ విక్రయిస్తామంటే కేసీఆర్ కొనుగోలు చేయడం లేదన్నారు. చాలా రాష్ట్రాల్లో అవసరానికి మించి విద్యుదుత్పత్తి జరుగుతోందన్నారు. కాబట్టి తక్కువకు కొనుగోలు చేయవచ్చునని చెప్పారు.