అశోక్ గజపతిరాజుకు స్వాగతం పలికి చిక్కుల్లో పడ్డ ఆరుగురు అర్చకులు
- రామతీర్థంకు వెళ్లిన అశోక్ కు పూర్ణకలశంతో స్వాగతం పలికిన అర్చకులు
- అర్చకులకు షోకాజ్ నోటీసులు పంపిన ఆలయ ఈవో
- పూజారులపై ప్రతాపం ఏమిటని టీడీపీ మండిపాటు
ఈ విషయాన్ని ఆలయ ఈవో కిశోర్ కుమార్ తప్పుపట్టారు. ఆరుగురు అర్చకులకు షోకాజ్ నోటీసులు పంపారు. అశోక్ కు ఎందుకు స్వాగతం పలికారో వివరణ ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు. మరోవైపు ఈవో చర్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ నేతలకు దమ్ముంటే తమతో పోరాడాలని... పూజలు చేసే పూజారుల మీద మీ ప్రతాపం ఏమిటని విరుచుకుపడ్డాయి. ఆలయ ఈవో వైసీపీ నేత మాదిరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి.