Team India: కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్.. 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులతో ఆడుతున్న విండీస్

  • తొలుత తడబడిన భారత బౌలర్లు
  • రెండు వికెట్లు తీసిన అశ్విన్
  • 20వ ఓవర్లో వికెట్ తీసిన శార్దూల్
West Indies vs India Score

డొమినికా వేదికగా భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో విండీస్ 25 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతోంది. భారత్ ప్రారంభంలో కాస్త తడబడినప్పటికీ ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి విండీస్ 29 పరుగులు చేసింది. కానీ ఒక్క వికెట్ పడలేదు. ఆ తర్వాత కాసేపటికే అశ్విన్ బౌలింగ్ లో చందర్ పాల్ ఔటయ్యాడు. ఆ తర్వాత బ్రాత్ వైట్ కూడా అశ్విన్ బౌలింగ్ లోనే పెవిలియన్ కు చేరాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్లో రీఫర్ అవుటయ్యాడు. విండీస్ 28 ఓవర్లకు 68 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News