air india: లక్నోలో ఎయిరిండియా ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విమానంలో ఏపీ అధికారులు

  • ఢిల్లీ నుండి విశాఖపట్నం వస్తున్న విమానంలో సాంకేతిక లోపం
  • విమానంలో ఏపీకి చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు
  • తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన
Air India pilot makes emergency landing in lucknow

ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఎయిరిండియా విమానం శుక్రవారం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. దేశ రాజధాని ఢిల్లీ నుండి విశాఖపట్నం వస్తున్న ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో లక్నో విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. వారిని ఎప్పుడు పంపుతారో ఎయిర్ లైన్స్ సమాచారం ఇవ్వవలసి ఉంది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

More Telugu News