ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని నియమించిన చంద్రబాబు
- ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
- ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ
- కీలక కమిటీకి రూపకల్పన చేసిన చంద్రబాబు
- ఓ ప్రకటనలో వెల్లడించిన అచ్చెన్నాయుడు
ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ కీలక కమిటీకి రూపకల్పన చేశారు. ఎనిమిది మందితో ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని నేడు ప్రకటించారు.
ఈ కమిటీలో కనకమేడల రవీంద్రకుమార్, వర్ల రామయ్య, పి.కృష్ణయ్య, ఎస్.రాజశేఖర్ (ఇన్చార్జి), పి.కృష్ణమోహన్, వజ్జా శ్రీనివాసరావు, చిరుమామిళ్ల ప్రసాద్, కోనేరు సురేశ్ సభ్యులుగా నియమితులయ్యారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు 8 మంది సభ్యులతో ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని నియమించినట్టు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.