కర్నూలు మెడికల్ కాలేజీలో స్టూడెంట్ ఆత్మహత్య
- హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్న యువకుడు
- ప్రేమ విఫలం కావడం వల్లేనని పోలీసుల అనుమానం
- ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహం తరలింపు
పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న లోకేశ్ సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో తన గదిలో ఉరి వేసుకున్నాడు. తెల్లవారుజామున మిగతా విద్యార్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. లోకేశ్ స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలి అని పోలీసులు వెల్లడించారు. ప్రేమ విఫలం కావడం వల్లే లోకేశ్ ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. లోకేశ్ తండ్రి బ్రహ్మానందరావుకు సమాచారం అందించినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.