Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన పోలీసు జీపు

  • జీఎంసీ టోల్ గేట్ దాటే సమయంలో ప్రమాదం
  • నలుగురు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు గాయాలు
  • తిరుపతిలోని అశ్విని ఆసుపత్రిలో చికిత్స
Accident on Tirumala ghat road

తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవలి కాలంలో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మొదటి ఘాట్ రోడ్డులో ఈ రోజు ప్రమాదం జరిగింది. జీఎంసీ టోల్ గేట్ దాటే క్రమంలో ఈ మధ్యాహ్నం ఒక పోలీసు వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

More Telugu News