విద్య ప్రసాదించిన ఐఐటీకి రూ.315 కోట్ల విరాళం
- టెక్నాలజీ రంగ నిపుణుడు నందన్ నీలేకని నిర్ణయం
- ఐఐటీ బాంబేకి భారీ విరాళం ఇస్తున్నట్టు ప్రకటన
- గతంలోనూ రూ.85 కోట్ల విరాళం
ప్రపంచస్థాయి సదుపాయాలు, పరిశోధన కోసం, ఐఐటీ బాంబేలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. నీలేకని ఐఐటీ బాంబేలో 1973లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరారు. ‘‘ఐఐటీ బాంబే నా జీవితానికి మూలస్తంభం వంటిది. నా ప్రయాణానికి పునాది వేసింది. ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థతో నా అనుబంధానానికి 50 ఏళ్లు. భవిష్యత్తు కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నందుకు గర్వపడుతున్నాను’’ అని నందన్ నీలేకని ప్రకటించారు.