Startups: ఐఐటీ చదువుకు మధ్యలోనే గుడ్‌బై.. తరువాత 150 రోజుల్లో రూ.256 కోట్ల సంపాదన

  • ఐఐటీ చదువుకు మధ్యలోనే గుడ్‌బై చెప్పేసిన రాహుల్ రాయ్
  • తనకు ఇష్టమైన ఆర్థికశాస్త్రంలో ప్రముఖ వార్టన్ స్కూల్ నుంచి డిగ్రీ పట్టా
  • అనంతరం, మార్గన్ స్టాన్లీ కంపెనీలో ఏడాది పాటు ఉద్యోగం
  • అనంతరం భారత్‌లో మరో ఇద్దరితో కలిసి క్రిప్టో ఫండ్ ఏర్పాటు. 
  • ఆ తరువాత ఐదు నెలలకే తన సంస్థను రూ.256 కోట్లకు మరో సంస్థలో విలీనం
  • తద్వారా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయిన వైనం
Meet man who quit IIT for BSc earned Rs 256 crore in 150 days

ఐఐటీ చదువులు..గొప్ప ఉద్యోగం.. ఇది ఒకప్పటి యువత లక్ష్యాలు. నేటి యువత కాస్త డిఫరెంట్. అభిరుచినే వ్యాపారావకాశాలుగా మలుచుకుంటూ రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోతున్నారు నేటి యూత్. ఈ ట్రెండ్‌కు సరైన ఉదాహరణ రాహుల్ రాయ్. ఐఐటీ చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టిన ఈ యువకుడు ఆ తరువాత 150 రోజుల్లో రూ.256 కోట్లు సంపాదించాడు. 

చదువుల్లో చురుకుగా ఉండే రాహుల్ ఐఐటీ జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్‌లో చేరాడు. కానీ కొన్ని రోజులకే ఆ చదువులు తనకు సరిపోవని అతడు భావించాడు. దీంతో, ఆ చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టి తనకు నచ్చిన ఆర్థికశాస్త్రంపై దృష్టి పెట్టాడు. ఆ తరువాత అమెరికాలోని ప్రముఖ వార్టన్ కాలేజీ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన అతడు మోర్గన్ స్టాన్లీ సంస్థలో ఓ ఏడాది పాటు పనిచేశాడు. ఆ తరువాత ఇండియాకు తిరిగొచ్చి మరో ఇద్దరితో సొంతంగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ చేసే సంస్థను ప్రారంభించాడు. 

గామా పాయింట్ క్యాపిటల్ పేరిట నెలకొల్పిన ఈ సంస్థ ప్రధానంగా డిజిటల్ ఉత్పత్తులు, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టేది. వారి వ్యూహం ఫలించడంతో సంస్థ చూస్తుండగానే లాభాల బాట పట్టింది. కానీ, సంస్థ ఏర్పాటు చేసిన ఐదు నెలలకే రాహుల్ ముంగిట ఓ అద్భుతమైన ఆఫర్ వచ్చింది. తమ సంస్థను కొనుగోలు చేస్తామంటూ బ్లాక్ టవర్ క్యాపిటల్ ముందుకు రావడంతో వారు కాదనలేదు. దీంతో, రూ.256 కోట్లకు బ్లాక్ టవర్, గామా క్యాపిటల్ సొంతమైంది. ఈ క్రమంలో రాహుల్‌తో పాటూ సంస్థ సహ వ్యవస్థాపకులందరూ రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోయారు.

More Telugu News