బాపట్లలో అమానుషం.. టెన్త్ విద్యార్థిపై పెట్రోలు పోసి నిప్పంటించిన స్నేహితుడు
- రాజోలు పంచాయతీలోని ఉప్పలవారిపాలెంలో ఘటన
- ట్యూషన్కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో పెట్రోలు పోసి నిప్పు పెట్టిన స్నేహితుడు
- చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడు
బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే మంటలు ఆర్పి గుంటూరు జీజీహెచ్కు తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరికొందరితో కలిసి వెంకటేశ్వర్రెడ్డి తనపై పెట్రోలు పోసి నిప్పు అంటించినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అమర్నాథ్ చెప్పాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.