సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన కరాటే కల్యాణి
- తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో
వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు - లలిత్ కుమార్, అతని టీమ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
- సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం విషయంలో వార్తల్లో నిలిచిన కల్యాణి
ఇలా ఆమె ఫొటోలు వైరల్ చేస్తున్న చేస్తున్న లలిత్ కుమార్, అతని టీమ్ మీద కేసులు నమోదు చేసినట్టు సమచారం. తన ఎదుగుదల తట్టుకోలేక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కల్యాణి ఆరోపిస్తున్నారు. కాగా, ఎన్టీఆర్ విగ్రహం విషయంలో ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు విగ్రహావిష్కరణను నిలిపివేసింది. ఆ క్రమంలో ఎన్టీఆర్ విషయంలో కల్యాణి చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసి 'మా' నుంచి ఆమెను సస్పెండ్ చేసింది.