వారిద్దరు భారత్ గౌరవాన్ని నిలబెట్టారు: రవిశాస్త్రి
- రహానే, ఠాకూర్ భాగస్వామ్యాన్ని మెచ్చుకున్న టీమిండియా మాజీ కోచ్
- ఐపీఎల్ సీజన్ తో అతడికి స్వేచ్ఛ లభించిందని వ్యాఖ్య
- సీఎస్కేలో ఉండడాన్ని ఆస్వాదించానన్న రహానే
సీఎస్కే పాత్ర
అజింక్య రహానేని ఈ ఏడాది మినీ వేలంలో ఎవరూ వద్దనుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రూ.50 లక్షల బేసిక్ ధరకు తీసుకుంది. ఆడేందుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. చాలా సీనియర్ అయిన రహానే ఈ అవకాశంతో రెచ్చిపోయాడు. స్వేచ్ఛగా ఆడి సీఎస్కే తరఫున పలు విజయాల్లో కీలకంగా పనిచేశాడు. దీనిపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మూడో రోజు ఆట ముగిసిన తర్వాత రహానేని దీనిపైనే ప్రశ్నించాడు. దీనికి రహానే స్పందిస్తూ.. నిజమే సీఎస్కేలో ఉండడాన్ని తాను ఎంతో ఆనందించినట్టు చెప్పాడు. రవిశాస్త్రి సైతం స్పందిస్తూ.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తో అతడికి ఒక విధమైన స్వేచ్ఛ లభించిందన్నారు.