ashok gehlot: అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఈడీ దాడులు: రాజస్థాన్ ముఖ్యమంత్రి

  • ప్ర‌శ్నా ప‌త్రం లీకేజీ ఆరోప‌ణ‌ల‌పై ప‌లు ప్రాంతాల్లో ఈడీ సోదాలు
  • కేంద్ర ప్ర‌భుత్వం ద‌ర్యాప్తు సంస్ధ‌ల‌ను దుర్వినియోగం చేస్తోంద‌న్న సీఎం గెహ్లాట్ 
  • అధికార పార్టీ ఒత్తిడికి త‌లొగ్గి ప‌ని చేయ‌వ‌ద్ద‌ని ద‌ర్యాప్తు సంస్ధ‌ల‌కు హితవు
Rajasthan CM Ashok Gehlot Hits At BJP

అసెంబ్లీ ఎన్నిక‌ల నేపథ్యంలో రాష్ట్రంలో ఈడీ దాడులు చేప‌డుతోంద‌ని రాజ‌స్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. కేంద్ర ప్ర‌భుత్వం ద‌ర్యాప్తు సంస్ధ‌ల‌ను దుర్వినియోగం చేస్తోంద‌న్నారు. సికార్ జిల్లాలో శుక్ర‌వారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో గెహ్లాట్ మాట్లాడారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల రిక్రూట్మెంట్ ప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్నా ప‌త్రం లీకేజీ ఆరోప‌ణ‌ల‌పై రాజస్ధాన్‌లోని ప‌లు ప్రాంతాల్లో సోమ‌వారం ఈడీ సోదాలు చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌తను సంత‌రించుకున్నాయి.

ఈడీతో పాటు ఇత‌ర కేంద్ర ప్ర‌భుత్వ ఏజెన్సీలు, ద‌ర్యాప్తు సంస్ధ‌లు కేంద్రం ఒత్తిడితో పని చేస్తున్నాయన్నారు. దేశంలో రాజ్యాంగానికి కాషాయ పాల‌కులు తూట్లు పొడుస్తున్నార‌న్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతుంటే ఆయా రాష్ట్రాల‌కు ద‌ర్యాప్తు సంస్ధ‌ల‌ను పంపుతున్నార‌ని మండిపడ్డారు. అధికార పార్టీ ఒత్తిడికి త‌లొగ్గి ప‌ని చేయ‌వ‌ద్ద‌ని ద‌ర్యాప్తు సంస్ధ‌ల‌కు విజ్ఞప్తి చేశారు.

బీజేపీ ఎప్పుడూ కాంగ్రెస్ రహిత భారత్ అని చెబుతుంటుందని, అయితే గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అందరి బాధ్యత అనీ అన్నారు. ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌నేది ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌న్నారు. రాష్ట్రంలో తాము ప్రారంభించిన ప‌థకాలను కొనసాగించేందుకు మళ్లీ త‌మ‌ను ఆశీర్వ‌దించాల‌ని ప్ర‌జ‌లకు విజ్ఞ‌ప్తి చేశారు.

More Telugu News