ప్రతిపక్షాల సమావేశానికి కేసీఆర్ దూరం.. కారణం ఇదే!
- 23న పాట్నాలో జరిగే సమావేశానికి రానని బీహార్ సీఎం నితీష్ కు సమాచారం
- కాంగ్రెస్ తో కూడిన కూటమిలో చేరేందుకు నిరాకరిస్తున్న బీఆర్ఎస్ అధినేత
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న బీఆర్ఎస్
‘కేసీఆర్ ఎప్పుడూ కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ గురించే మాట్లాడారు. పాట్నాలో జరిగే సమావేశం ఆయన భావిస్తున్న ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఉంది. ఆయన కాంగ్రెస్తో వేదిక పంచుకోబోరు’ అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చెప్పినట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన పోటీదారుగా భావిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల సమావేశానికి గైర్హాజరవుతున్నారని తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న పార్టీతో ఉమ్మడి వేదికను పంచుకోవడం ఎన్నికల సంవత్సరంలో ఓటర్లకు విరుద్ధమైన సంకేతాలను పంపుతుంది.