‘నా గుండె పగిలింది’.. ఒడిశా రైలు విషాదంపై జో బైడెన్
- ఒడిశా విషాదంలో 288 మంది మృతి
- తమ హృదయాలు ద్రవించిపోయాయన్న జో బైడెన్
- బాధితుల తరపున ప్రార్థిస్తున్నట్టు చెప్పిన అధ్యక్షుడు
ఈ విషాదంపై జో బైడెన్ స్పందించారు. ఈ ఘోర ప్రమాదం గురించి తెలిసి తనతోపాటు ప్రథమ పౌరురాలైన జిల్ బైడెన్ హృదయాలు విషాదంలో మునిగిపోయాయని అన్నారు. ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన వారు, గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. అమెరికా, భారత్ మధ్య సాంస్కృతిక, కుటుంబ బంధాలు బలంగా పెనవేసుకుపోయాయని అన్నారు. ఒడిశా ప్రమాదంపై అమెరికా ప్రజలందరూ సంతాపం తెలుపుతున్నట్టు బైడెన్ పేర్కొన్నారు.