Tirupati: తిరుపతిలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

  • ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు సమీపంలో ఘటన
  • ఆర్టీసీ బస్సు కారును ఢీకొనడంతో ప్రమాదం
  • ఘటనలో భార్య,భర్త, చిన్నారి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • రూయా ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స 
Three persons including a child from Telangana die in road accident in tirupati

తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలంలో బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృత్యువాత పడ్డారు. మేర్లపాక చెరువు వద్ద ఓ ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ఓ చిన్నారి, బిడ్డ తల్లిదండ్రులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానిక రూయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లె వాసులుగా గుర్తించారు.

  • Loading...

More Telugu News