టర్కీ పీఠం మళ్లీ ఎర్డోగాన్దే.. మూడో దశాబ్దంలోకి అడుగు!
- ఆదివారం జరిగిన రీఎలక్షన్లో ఎర్డోగాన్ విజయం
- ఇప్పటికే రెండు దశాబ్దాలుగా టర్కీని ఏలుతున్న ఎర్డోగాన్
- మే 14న జరిగిన ఎన్నికల్లో ఓటమి.. ఇప్పుడు జయకేతనం
ఇప్పటికే రెండు దశాబ్దాలపాటు టర్కీని పాలిస్తున్న ఎర్డోగాన్ ఈ విజయంతో మూడో దశాబ్దంలోకి ప్రవేశించారు. ఇస్తాంబుల్, అంకారాలలో ఎర్డోగాన్ ప్రసంగిస్తూ తనకు విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అంకారాలోని అధ్యక్ష భవనం వెలుపల గుమికూడిన వేలాదిమంది మద్దతుదారులను ఉద్దేశించి ఎర్డోగాన్ మాట్లాడుతూ.. రెండో శతాబ్దం కోసం కష్టపడి పనిచేస్తానని అన్నారు. దీనిని ‘టర్కీ శతాబ్దం’గా అభివర్ణించారు.
టర్కీ ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. రెండు దశాబ్దాలుగా టర్కీని పాలిస్తున్న ఎర్డోగాన్ మే 14న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో విజయానికి దూరమయ్యారు. ఎన్నికల్లో ఆయన పూర్తిగా ఓటమి చెందడం ఇదే తొలిసారి. అయితే, ఆదివారం జరిగిన రీ ఎలక్షన్లో ఆయన విజయం సాధించి మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.